రాహుల్ గాంధీ ఆదేశా లతో తీన్మార్ మల్లన్న సస్పెండ్: టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్

Madupa Santhosh CEO
రాహుల్ గాంధీ ఆదేశాను సారం తీన్మార్ మల్లన్న సస్పెండ్: టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ 
హైదరాబాద్ : అక్షరతెలంగాణ : 
ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న విషయంలో కాంగ్రెస్ పార్టీ  ఏఐసీసీ నిర్ణయం తీసుకుందని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ చెప్పారు. అగ్రనేత రాహుల్ ఆదేశాలతోనే సస్పెండ్ చేసినట్లు తెలిపారు. భవిష్యత్తులో ఎవరైనా పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరిస్తే ఇవే పరిణామాలు ఎదుర్కొవాల్సి వస్తుందని హెచ్చరించారు. కులగణనతో పాటు ఓ వర్గాన్ని ఉద్దేశించి తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారినందున ఈ పరిస్థితి కి రావడం  తెలిసిందే. ఇటీవల బీసీ సభలో ఓ వర్గంపై మల్లన్న వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు హైకమాండ్ గుర్తించింది. ఆ వ్యాఖ్యలపై ఫిబ్రవరి 12 లోపు వివరణ ఇవ్వాలని ఫిబ్రవరి  5న షోకాజ్ నోటీసులు ఇచ్చింది. మల్లన్న స్పందించకపోవడంతో పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు తాజాగా ప్రకటించింది.
Comments