విద్యార్థులను భావిశాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దాలి
విద్యార్థుల్లో ఉపాధ్యాయులు జిజ్ఞాస పెంపొందించి, వారిని భావిశాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దాలని జిల్లా పాలనాధికారి రాజర్షి షా అన్నారు. జైనథ్ ఆదర్శ పాఠశాల అధ్యాపకులు గోస్కుల సత్యనారాయణ రచించిన 'భారతీయ, పాశ్చాత్య శాస్త్రవేత్తలు' పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఉపాధ్యాయులు తమ జ్ఞానాన్ని, వృత్తి పరమైన అనుభవాలను గ్రంథస్తం చేసి ముందు తరాలకు అందించాలని సూచించారు. మన దేశానికి సంబంధించిన శాస్త్రవేత్తల గురించి ప్రస్తావించడం మంచి ప్రయత్నం అని అభినందించారు.
కార్యక్రమంలో ఆరోగ్య పాఠశాల సమన్వయ కర్త దీకొండ వార్ అజయ్, ప్రిన్సిపల్ రాము, బయోసైన్సు జిల్లా ఫోరం అధ్యక్షులు రఘువెందర్ లు పాల్గొన్నారు.
Comments