Rajendhranagar : అక్షర తెలంగాణ : ముగ్గురు దుండగులు రహదారి దోపిడీకి పాల్పడిన వారిని మైలార్దేవ్పల్లి పోలీసులు అరెస్టు చేశారు. దుండగుల నుంచి 18 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు.
రాజేంద్రనగర్ డీసీపీ చింతమనేని శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.. రాజస్థాన్ శిఖర జిల్లా ఫతేపూర్ కు చెందిన సచిన్ స్వామి కాటేదాన్ లోని సుమిత్ మోడీకి చెందిన ఎస్ఆర్ఎమ్ ప్లాస్టిక్ కంపెనీలో పనిచేశారు. రెండు సంవత్సరాల క్రితం సచిన్ ను యాజమాన్యం పనిలో నుంచి తొలగించింది.
అప్పటినుంచి పగపెంచుకున్నాడు. అదే కంపెనీలో పని చేస్తున్న తన గ్రామానికి చెందిన హేమంత్ శర్మతో చేతులు కలిపాడు. హేమంత్ శర్మ కంపెనీలో యజమాని కదలికలను సచిన్ కు అందించారు. సుమిత్ తను బామ్మర్ది జితేందర్ బాలాజీ ని రాఘవేంద్ర నగర్ లోని తన ఇంటి నుంచి 20 లక్షల రూపాయల నగదు సొమ్ము తీసుకురమ్మని ఆదేశించారు. తెలుసుకున్న హేమంత్ సచిన్ అనే వ్యక్తి సమాచారం అందించాడు. టీవీఎస్ ( TVS)మోటార్ సైకిల్ పై రూపాయలను తీసుకువస్తున్న జితేందర్ ను కారు లో వచ్చిన దుండగులు రాఘవేంద్ర కాలనీలో ఢీ కొట్టారు.జితేందర్ అనే వ్యక్తి కింద పడిపోగానే 20 లక్షల రూపాయల నగదు బ్యాగును తీసుకొని స్వామి ముఠా పరార్ అయింది. సమాచారం అందుకున్న రాజేంద్రనగర్ మైలార్దేవ్ పల్లి క్రై విభాగం పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు పారంభించారు. వాహనంలో నిర్మల్ నుండి మహారాష్ట్ర వైపు వెళుతున్నట్టు గుర్తించారు. దీంతో రాజేంద్రనగర్ ప్రత్యేక పోలీసు బృందాలు పట్టుకున్నారు. వారి నుండి 18 లక్షల రూపాయల నగదు మరియు మూడు మొబైల్ ఫోన్లు, కారును స్వాధీనం చేసుకున్నారు. చాకచక్యంగా వ్యవహరించి కేసును ఛేదించిన మైలార్దేవులపల్లి, సి.సి.ఎస్, ఎస్.ఓ.టి పోలీసులను డీసీపీ చింతమనేని శ్రీనివాస్ వారిని కొనియాడారు.
Comments