Union Budget (యూనియన్ బడ్జెట్)2025:మెడికల్ /ఐ ఐ టి సీట్లను భారీగా పెంచిన-కేంద్ర ఆర్థికమంత్రి

Madupa Santhosh CEO
Union Budget (యూనియన్ బడ్జెట్)2025:

మెడికల్ /ఐ ఐ టి సీట్లను భారీగా పెంచిన-ఆర్థికమంత్రి కీలక ప్రకటన.చేసారు.

కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన వచ్చే ఏడాది కేంద్ర బడ్జెట్ లో విద్యారంగానికి గుడ్ న్యూస్ తెలిపారు. ముఖ్యంగా దేశంలో విద్యారంగంలో పెరుగుతున్న పోటీని దృష్టిలో ఉంచుకుని ఉన్నత స్థాయి విద్యాసంస్థలైన ఐఐటీలు, మెడికల్ కాలేజీలను  బలోపేతం చేసే దిశగా కీలక నిర్ణయాలు ప్రకటించారు. ఐఐటీలు, మెడికల్ కాలేజీల్లో సీట్లను భారీగా పెంచబోతున్నట్లు నిర్మలమ్మ ప్రకటించారు. వీటి తో పాటు ఏఐ (AI) సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ల ఏర్పాటును ప్రకటించారు.
ఏఐకి (AI)పెరుగుతున్న ఆదరణ నేపథ్యంలో దేశవ్యాప్తంగా మూడు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కేంద్రాల్ని ఏర్పాటు చేయనున్నట్లు ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. అలాగే ఐఐటీలు, మెడికల్ కాలేజీల్ని బలోపేతం చేయనున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా ఐఐటీలను విస్తరించనున్నట్లు తెలిపారు. 2014 తర్వాత ప్రారంభించిన ఐదు ఐఐటీల్లో మరో 6500 మంది విద్యార్థులకు విద్యను అందించడానికి అదనపు మౌలిక సదుపాయాలు అందిస్తామని తెలిపారు. ఇందులో ఐఐటీ పాట్నాలో హాస్టల్, మౌలిక సదుపాయాలను విస్తరించనున్నట్లు ఆర్ధిక మంత్రి పేర్కొన్నారు.
 గత పదేళ్లలో 23 ఐఐటీల్లో మొత్తం విద్యార్థుల సంఖ్య 100 శాతం పెరిగి 65వేల నుంచి 1.35 లక్షలకు పెరిగిందని ఆర్థికమంత్రి తెలిపారు. ఈ నేపథ్యంలో 2014 తర్వాత ఏర్పాటైన ఐదు ఐఐటీల్లో మరో 6,500 మంది విద్యార్థులకు వసతి కల్పించేందుకు అదనపు మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు. అలాగే వైద్య విద్యను విస్తరించడంపై ప్రభుత్వం దృష్టి సారించినట్లు ఆర్థిక మంత్రి తెలిపారు.
 వైద్యరంగంలో మౌలిక సదుపాయాల్ని పటిష్టం చేసేందుకు వీలుగా వచ్చే ఐదేళ్లలో 75 వేల సీట్లు పెంచబోతున్నట్లు తెలిపారు.
 వచ్చే ఏడాదిలోనే మెడికల్ కాలేజీలు, ఆసుపత్రుల్లో 10వేల అదనపు సీట్లు అందుబాటులోకి తెస్తామన్నారు.
Comments