తొలిసారిగా నాగోబా జాతర లో అంగరంగ వైభవంగా కొనసాగిన సాంస్కృతిక కార్యక్రమాలు

Madupa Santhosh CEO
 

- జ్యోతి ప్రజ్వలన గావించి ప్రారంభించిన జిల్లా పాలనాధికారి రాజర్షి షా, జిల్లా ఎస్పి గౌస్ ఆలం, ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా,  వెంకట్ రావ్ పటేల్.

- ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ నాగోబా జాతర లో  ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.
అదిలాబాద్ : ఉట్నూర్: అక్షర తెలంగాణ: ప్రతినిధి : జనవరి 30 
ఆదిలాబాద్ జిల్లా ఇంద్ర‌వెల్లి మండ‌లం కేస్లాపూర్ నాగోబా జాతర ఈ నెల 28 వ తేది నుండి ఫిబ్రవరి  4 వ తేది వరకు జాతర కొనసాగనున్న సందర్భంగా మొదటి రోజు  మహపూజ తో ప్రారంభమై , రెండవ రోజు నుండి భక్తులు నాగోబా దేవాలయాన్ని దర్శించుకుంటున్నారు. ఈ నేపథ్యం లో మూడవ రోజు ఆదివాసీ సంస్క్రుతి సంప్రదాయాలు ఉట్టిపడేలా కళాకారులచే నృత్య ప్రదర్శనలు ఘనంగా నిర్వహించడం జరిగింది.
తెలంగాణ‌లో జ‌రిగే ఈ ఆదివాసీ సంబురం తెలంగాణలో రెండో అతిపెద్ద జాతరగా పేరొంది, సుదూర ప్రాంతాల నుండి భక్తులు తరలివచ్చి ఈ వేడుకలను తిలకించారు 
ఈ సందర్భంగా మార్లవాయి  జైనూర్ మండలం నుండి గుస్సాడి డ్యాన్స్,కొలాం డ్యాన్స్ గుడిహాత్నూర్ గోండి దింసా కోహినూర్ఆంధ్ కమ్యూనిటీ, ఇంద్రవెల్లిపర్ధాన్ కమ్యూనిటీ డ్యాన్స్ తోటి,తోషంనాయక్ పొడ్ పరార్ ఫౌండేషన్ హైదారాబాద్ నుండి  వృక్ష సంపద పర్యావరణ పరిరక్షణ ల పై కళాకారులు ప్రదర్శన, నృత్యాలు చూపరులను విశేషంగా అలరించాయి.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఉదయం ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షించారు.ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ యువరాజ్, ట్రైనీ కలెక్టర్ అభి గ్యాన్, ఆసిఫాబాద్ కలెక్టర్ వెంకటేష్ ధోత్రే దంపతులు పాల్గొన్నారు.  ఆలయ కమిటీ సభ్యులు,  జిల్లా అధికారులు, తదితరులు ఉన్నారు.

Comments